Drip / బిందు సేద్యం!
వేర్లకే తేమ ఇవ్వటం మేలు!
Sakshi | Updated: March 25, 2015 23:25 (IST)
డ్రిప్ పద్ధతి
మొక్కకు నీటి చుక్కలు ఇచ్చే కన్నా. నేలలో పాతిన కుండ ద్వారా.. నేరుగా మొక్కల వేరు వ్యవస్థకే.. అత్యంత పొదుపుగా నీటి తేమనందించే అధునాతన డ్రిప్ వ్యవస్థ ‘స్వర్’ సాధారణ డ్రిప్కు ఖర్చయ్యే నీటిలో 10% చాలు.. కరెంటుతో పనిలేదు.. కలుపు రాదు.. వినూత్న ఆవిష్కరణకు {ఫెంచ్ ప్రభుత్వ పురస్కారం జలం.. ప్రాణావసరం! తరుముకొస్తున్న కరువు కాలంలో.. ప్రతి నీటి బొట్టూ ప్రాణప్రదమే. ఒక్క చుక్కనూ సృష్టించలేం.. పది నీటి బొట్లు వాడే చోట ఒక్కదానితో ప్రాణం నిలబెట్టుకోవాలి- అది మనిషిదైనా, మొక్కదైనా! నీటి పారుదలకు స్వస్తి చెప్పి.. చుక్కలు చుక్కలుగా నేలను తడిపే బిందు సేద్యాన్ని చేపట్టాం. ఆహా ఓహో అనుకుంటున్నాం.. అయితే, ఈ బిందు సేద్యానికీ చాలినంత నీరు లేకపోతే..? అన్నదాతల రేపటి ఆశలకు ప్రతి రూపాలైన పండ్ల మొక్కలను మండుటెండల నుంచి కాపాడుకునేదెలా..? నీరూ సరిగ్గా లేక.. కరెంటూ అంతకన్నా అందని స్థితిలో రైతుకు దిక్కేమిటి? ఇదే ప్రశ్న సామాజిక శాస్త్రవేత్త కే ఎస్ గోపాల్ మదిని ఏళ్ల తరబడి తొలిచేసింది. ఎడతెగని మథనం తర్వాత.. ఆయన మదిలో ఒక అద్భుత ఆవిష్కరణ మెరిసింది! బిందు సేద్యానికయ్యే నీటి ఖర్చులో 10% తోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకునే భేషైన ఉపాయం తట్టింది. కరెంటూ అక్కర్లేదు. కలుపు బెడదా లేదు. ఈ వినూత్న ఆలోచనను రైతుల పొలాల్లో మూడేళ్లుగా ఆచరణలో పెట్టి.. మరింత సమగ్రంగా తీర్చిదిద్దారు. దీని పేరు ‘సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్’(స్వర్). హైదరాబాద్ కేంద్రంగా గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్(సీడబ్ల్యూసీ)కు ఆయన 2 దశాబ్దాలుగా సారధిగా ఉన్నారు. మేనేజ్మెంట్ టీచింగ్లో అనుభవం గడించిన ఆయన గతంలో ముంబై ‘టిస్’లోను, హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లోనూ సేవలందించారు. ఉపాధి హామీ పథకంపై పనిచేస్తున్న దశలో ‘స్వర్’ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. గత నెలలో పారిస్లో జరిగిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పోజిషన్లో ‘స్వర్’కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఛాంపియన్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ‘స్వర్’ను మరింత మెరుగుపరచి అంతర్జాతీయ సమాజానికి అందుబాటులోకి తేవడానికి ఈ పురస్కారం అవకాశం కల్పిస్తుందని గోపాల్ ఆశిస్తున్నారు. నీటి వనరులు బొత్తాగా కొడిగడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరటి తోటలు, పండ్ల తోటలతోపాటు అడవుల పెంపకానికీ ఎంతగానో ఉపకరించే ‘స్వర్’ గురించి వివరంగా గోపాల్ అందించిన వివరాల మేరకు.. మీ కోసం! మండువేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీల సెల్షియస్కు పెరిగినప్పుడు.. ఎటువంటి ఆచ్ఛాదన లేని నేల ఉష్ణోగ్రత 60-65 డిగ్రీల వరకు ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు తమ భూముల్లో నాటుకున్న పండ్లమొక్కలు, బంజరు భూముల్లో నాటిన అడవి జాతి మొక్కలకు పుష్కలంగా నీరందించడం కరువు ప్రాంతాల్లో కనాకష్టమే. డ్రిప్ ఏర్పాటు చేయడానికి అక్కడ విద్యుత్, బోరు అందుబాటులో లేకపోవచ్చు. వాటిని ఏర్పాటు చేసుకునే స్థోమత రైతుకు ఉండకపోవచ్చు. బోరు, డ్రిప్ సదుపాయాలున్నప్పటికీ.. డ్రిప్ పనిచేయడానికి సరిపోయేంత నీరుండకపోవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కలను బతికించడమే కాదు.. మంచి దిగుబడినిచ్చేంత ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా ‘స్వర్’ దోహదపడుతుంది. నేరుగా వేర్ల దగ్గరకే నీటి తేమ.. డ్రిప్ లేటరల్ పైపులు జారవిడిచే నీటి చుక్కలు నేలపైన పడి.. నిట్ట నిలువుగా మట్టిని తడుపుతుంటాయి. ఇలా ఖర్చయ్యే నీటిలో కొంత భాగం ఆవిరైపోగా.. మిగిలిన కొంతభాగం మాత్రమే భూమిలోపల ఉన్న మొక్కల వేళ్లకు అందుతుంది. కానీ.. అధునాతన డ్రిప్ అయిన ‘స్వర్’ భూమి లోపలే నీటిని వదులుతూ.. నేరుగా మొక్కల వేర్లకు తగుమాత్రంగా నీటి తేమను అందిస్తుంది. వేర్లకు చేరక ముందే నీరు ఆవిరైపోవటం ఉండదు. ‘వేర్లకు కావాల్సింది నీరు కాదు.. మట్టి రేణువుల మధ్